సియోల్: దక్షిణ కొరియాకు చెందిన రెండు వైమానిక దళ విమానాలు గాలిలోనే ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు పైలెట్లు మృతిచెందారు. రాజధాని సియోల్కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాచియాన్ నగరంలో ఈ ఘటన జరిగింది. కేటీ-1 ట్రైనర్ జెట్ ఢీకొన్నట్లు మిలిటరీ వర్గాల ద్వారా తెలుస్తోంది. శిక్షణ సమయంలో గాలిలోనే రెండు కేటీ-1 విమానాలు ఢీకొన్నట్లు రక్షణశాఖ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల ఎఫ్-35 ఫైటర్ జెట్ కూడా ప్రమాదానికి లోనైంది.