మాస్కో: ఉక్రెయిన్, రష్యాల మధ్య సుదీర్ఘకాలంగా యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. తాజాగా ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులకు పాల్పడింది. ఇటీవల కేవలం 24 గంటల వ్యవధిలో రష్యా దాడుల్లో 360 మంది ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ‘ఉక్రెయిన్పై మా సేనలు దాడి చేశాయి. కేవలం 24 గంటల్లో ఉక్రెయిన్కు చెందిన 360 మందిని మట్టుబెట్టాం’ అని తెలిపింది.
‘ఉక్రెయిన్కు చెందిన పలు ఆయుధ భాండాగారాలను మా సేనలు ధ్వంసం చేశాయి. ఆదేవిధంగా మా సైన్యం దాడుల్లో ఉక్రెయిన్కు చెందిన ఫిరంగులు, అమెరికా తయారు చేసి ఉక్రెయిన్కు ఇచ్చిన పలాడిన్ ఆర్టిలరీ వ్యవస్థ, పలు సైనిక వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి’ అని రష్యా రక్షణ శాఖ తెలిపింది. అంతేగాక ఉక్రెయిన్ ఎయిర్ఫోర్స్కు చెందిన Su-25 ఎయిర్ప్లేన్ను కూడా రష్యా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూల్చేసిందని రష్యా తెలిపింది.