బ్యాంకాక్ : మయాన్మార్లోని కాచిన్లో ఒక శరణార్థి శిబిరంపై సోమవారం రాత్రి సైన్యం వైమానిక దాడి జరిపింది. ఈ దాడిలో 13 మంది పిల్లలు సహా 32 మంది మరణించినట్టు మానవ హక్కుల సంస్థ, స్థానిక మీడియా వెల్లడించింది. రెబల్ కాచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ బేస్ హెడ్క్వార్టర్స్కు ఉత్తర ప్రాంతం లైజా పట్టణంలోని ముంగ్ లాయ్ హైకత్ నిర్వాసిత శిబిరంపై ఈ దాడి జరిగింది. ఈ దాడిలో 60 మంది గాయపడినట్టు కాచిన్కు చెందిన మానవ హక్కుల సంస్థ ప్రతినిధి చెప్పారు.