వాషింగ్టన్: అమెరికా మరోసారి కాల్పుల (Shooting) మోతతో దద్దరిల్లింది. మిచిగాన్లోని ఓ స్కూల్లో 15 ఏండ్ల బాలుడు తోటి విద్యార్థులపై కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. అందులో ఒక ఉపాధ్యాయుడు కూడా ఉన్నారు. మృతిచెందినవారిలో బాలుడు సహా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.
డెట్రాయిట్లోని ఆక్స్ఫర్డ్ హైస్కూల్లో (Oxford High School) మంగళవారం మధ్యాహ్నం ఈ దాడి జరిగిందని భద్రతాధికారి మైక్ మెక్కేబ్ తెలిపారు. ఘటనకు సంబంధించి కారణాలు తెలియాల్సి ఉందన్నారు. అంతా ఐదు నిమిషాల్లో జరిగిపోయిందన్నారు.
మధ్యాహ్నం 12:55 గంటల సమయంలో పాఠశాలలో కాల్పులు జరుగుతున్నట్లు తమకు సమాచారం అందిందని వెల్లడించారు. నిందితుడు ప్రస్తుతం తమ అదుపులోనే ఉన్నాడని తెలిపారు. అతని నుంచి ఆటోమేటిక్ హ్యాండ్గన్ సహా పలు రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. గాయపడినివారిలో ఇద్దరికి సర్జరీ జరిగిందని, మరో ఆరుగురు క్షేమంగా ఉన్నారని చెప్పారు.