మనీలా : ఫిలిప్పీన్స్ రాజధాని ప్రాంతంలోని యూనివర్సిటీలో ఆదివారం సాయుధు జరిపిన కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పట్టణ మాజీ మేయర్ సహా ముగ్గురు మృతి చెందారని, మరో వ్యక్తి గాయపడ్డారని అధికారులు తెలిపారు. సబర్బన్ క్యూజోన్ నగరంలోని అటెనియో డీ మనీలా యూనివర్సిటీ గేటు దగ్గర కాల్పులు జరిపిన అనంతరం రెండు పిస్టల్స్తో ఉన్న సాయుధుడిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల అనంతరం లా స్కూల్లో గ్రాడ్యుయేషన్ వేడుకను రద్దు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనను క్యూజోన్ నగర మేయర్ జాయ్ బెల్మోంటే ఖండించారు.
ఇలాంటి సంఘటనలకు సమాజంలో స్థానం లేదన్నారు. మృతుల్లో దక్షిణ బాసిలాన్ ప్రావిన్స్లోని లామిటన్ టౌన్ మాజీ మేయర్ రోసితా ఫురిగే, ఆమె సహాయకురాలు, యూనివర్సిటీ గార్డు ఉన్నారని అధికారులు తెలిపారు. రోసితా ఫురిగే కుమార్తె సైతం గాయపడగా.. ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. అయితే, కాల్పులకు కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. క్యూజోన్ నగరంలో తుపాకీపై నిషేధం ఉన్నప్పటికీ.. కాల్పులు చోటు చేసుకున్నాయి.