బెర్లిన్: వేగంగా వెళ్తున్న రైలులో ఒక వ్యక్తి కత్తితో ప్రయాణికులపై దాడి చేశాడు. దీంతో పలువురు గాయపడ్డారు. జర్మనీలోని బవేరియాలో శనివారం ఈ ఘటన జరిగింది. ఐసీఈ హైస్పీడ్ ట్రైన్లో ఒక దుండగుడు కత్తితో ప్రయాణికులపై దాడి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇందులో ఇద్దరి పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు పేర్కొంది.
మరోవైపు సెబర్స్డోర్ఫ్ రైల్వే స్టేషన్లో ఆ రైలును నిలిపివేశారు. భారీగా మోహరించిన పోలీసులు కత్తితో దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. గాయపడిన వారిలో ఎవరికీ ప్రాణ ముప్పు లేదని పోలీస్ అధికారి తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
కాగా, జర్మనీ ఇటీవల ఉగ్రవాద దాడుల ముప్పును ఎదుర్కొంటున్నది. 2015 నుంచి జిహాదీ, మితవాద తీవ్రవాద గ్రూపులు దాడులకు పాల్పడుతున్నాయి. ఈ ఏడాది జూన్ 25న దక్షిణ జర్మనీలోని వుర్జ్బర్గ్లో ఒక సోమాలి వ్యక్తి కత్తి దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు.