తైపి: చైనాకు చెందిన 21 యుద్ధ విమానాలు, అయిదు యుద్ధ నౌకలు.. తైవాన్ తీరంలో పహారా కాసినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. తైవాన్ జలాల్లోకి 8 జెట్ విమానాలు కూడా చొరబడినట్లు ఆ దేశం తెలిపింది. చైనా మిలిటరీకి చెందిన 17 విమానాలను, అయిదు నౌకలను ట్రాక్ చేసినట్లు తైవాన్ రక్షణశాఖ వెల్లడించింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ఫోర్స్కు చెందిన 17 విమానాలు తైవాన్ జలసంధిని దాటినట్లు మిలిటరీ తెలిపింది. చైనా విమానాల్లో జేహెచ్-7 ఫైటర్ బాంబర్లు, రెండు సుఖోయ్-30 ఫైటర్లు, రెండు షెన్యాంగ్ జే-11 జెట్స్ ఉన్నట్లు తైవాన్ తెలిపింది. ఉత్తరం దిక్కున ఉన్న మీడియన్ లైన్ను జేహెచ్-7, సుఖోయ్ విమానాలు క్రాస్ చేసినట్లు తైవాన్ పేర్కొన్నది.