టోక్యో : జపాన్లో గత సోమవారం ఏర్పడిన భారీ భూకంపం నోటో ద్వీపకల్పంలో కొత్త బీచ్లను ఏర్పాటు చేసింది. భూకంపం తీరం వెంబడి భూమిని పెంచింది. కొన్ని ప్రదేశాలలో తీర ప్రాంతాన్ని 820 అడుగుల వరకు విస్తరించింది.
దీంతో కొత్త బీచ్లు ఏర్పడ్డాయి. కొన్ని చోట్లయితే ఏకంగా 250 మీటర్లకు పైగా పైకి వచ్చినట్టు యూనివర్సిటీ ఆఫ్ టోక్యో వెల్లడించింది. సాంకేతికంగా అప్లిఫ్ట్గా వ్యవహరించే ఈ చర్య కారణంగా తీరం వెంబడి సుమారు 13 మీటర్ల వరకు భూమి పైకి లేచింది. ఇందుకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను అధికారులు విడుదల చేశారు.