సులవేసి: ఇండోనేషియా(Indonesia landslide)లోని సులవేసి దీవుల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 18 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. మట్టిదిబ్బలు కూలిపోవడంతో మరణాల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆచూకీ లేని వారి కోసం అన్వేషిస్తున్నారు. మకాలే గ్రామంలో ఆదివారం సుమారు 14 మంది మృతదేహాలను గుర్తించారు. దట్టమైన పొగ మంచు, వర్షం వల్ల రెస్క్యూ ఆపరేషన్ మందగించినట్లు అధికారులు తెలిపారు. తానా తొరాజా ప్రాంతంలో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి.