చెన్నై: సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ స్వల్ప స్కోరుకే తొలి వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ వేసిన నాలుగో ఓవర్ మొదటి బంతిని షాట్ ఆడిన రాహుల్ మిడ్ వికెట్లో కేదార్ జాదవ్ చేతికి చిక్కాడు. వాంఖడే మైదానంలో జోరుగా బ్యాటింగ్ చేసిన రాహుల్(4)..చెన్నై పిచ్కు అనుగుణంగా బ్యాటింగ్ చేయకపోవడంతో మూల్యం చెల్లించుకున్నాడు.
తొలి ఓవర్ నుంచే పంజాబ్ వికెట్పడకుండా జాగ్రత్తగా ఆడుతూ వచ్చింది. రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తుండటంతో మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(21), క్రిస్గేల్(7) నిలకడగా ఆడుతున్నారు. పవర్ప్లే ఆఖరికి పంజాబ్ వికెట్ నష్టానికి 32 పరుగులు చేసింది.