ఢాకా: బంగ్లాదేశ్లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢాకా-రాజ్షాహి హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతిచెందారు. ఓ వాహనానికి నిప్పు అంటుకోవడంతో.. దాంట్లో ఉన్న 11 మంది సజీవదహనం అయ్యారు. కాటకాలీ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. మైక్రో బస్సు, బస్సు ఢీకొనడం వల్ల ఈ విషాదం చోటుచేసుకున్నది. బస్సును ఢీకొట్టిన తర్వాత మినీబస్సులో భారీ శబ్ధం వచ్చింది. ఆ తర్వాత ఆ బస్సులో మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆ మంటల్ని ఆర్పేశారు. ప్రమాదంలో దహనమైన 11 మందిలో అయిదుగురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. టయోటా హైఏస్ వాహనం వేగంగా ఓ బస్సు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాలు నడిపినట్లు తెలుస్తోంది. బస్సుల నుంచి మంటలు రావడంతో.. అందులో ఉన్నవారిని రక్షించేందుకు ఎవరూ ముందుకు వెళ్లలేకపోయారు.