ఖాట్మండు: హిమాలయ దేశం నేపాల్లోని బారా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 16 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే అధికారులు, పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు.
అయితే, ప్రమాదానికి గురైన వాహనాల వివరాలుగానీ, ప్రమాదానికిగల కారణాలుగానీ ఇంకా తెలియరాలేదు. కాగా, నేపాల్లో రోడ్డు ప్రమాదాలు ఈ మధ్య పెరిగిపోయాయి. గత సోమవారం జరిగిన బస్ యాక్సిడెంట్లో కూడా ఇద్దరు ప్రయాణికులు మరణించగా.. మరో 36 మందికి గాయాలయ్యాయి.