బార్సిలోనా: స్పెయిన్లో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 155 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈశాన్య కాటలోనియా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బార్సిలోనా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక రైలు స్టేషన్లో పార్క్ చేసి ఉండగా.. ఆ రూట్లోనే ఎదురుగావస్తున్న మరో రైలు దాన్ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. సిటీ సెంటర్కు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మాంట్కాడా స్టేషన్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది.