కరోనాపై పోరుకు చేయూత
వాషింగ్టన్: కొవిడ్-19 సంక్షోభంతో అల్లాడుతున్న భారత్కు ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ 15 మిలియన్ డాలర్ల (రూ.1,10,19,99,750) సాయాన్ని అందించింది. ఈ మొత్తాన్ని కేర్, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ యూఎస్ఏ అనే మూడు ఎన్జీవోలకు విరాళంగా ఇచ్చినట్లు ట్విట్టర్ సీఈవో జాక్ ప్యాట్రిక్ డోర్సీ సోమవారం ట్వీట్ చేశారు. మొత్తం విరాళంలో కేర్కు 10 మిలియన్ డాలర్లు (రూ.73,49,98,000), ఎయిడ్ ఇండియాకు 2.5 మిలియన్ డాలర్లు (రూ.18,37,09,875), సేవా ఇంటర్నేషనల్ యూఎస్ఏకి 2.5 మిలియన్ డాలర్లు (రూ.18,37,09,875) అందజేసినట్లు వివరించారు. వెంటిలేటర్లు లాంటి ప్రాణ రక్షక పరికరాల కొనుగోలుకు ఈ విరాళం ఉపయోగపడుతుంది.