కీవ్: యుద్ధభూమి ఉక్రెయిన్పై రష్యా మరోసారి విరుచుకుపడింది. దేశవ్యాప్తంగా భారీగా క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో 11 మంది మరణించగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. భారీగా ఆస్తినష్టం జరిగిందని ఉక్రెయిన్ మిలిటరీ ప్రకటించింది. గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 47 నుంచి 55 క్షిపణులతో రష్యా దాడులు చేసిందని తెలిపింది. ఉక్రెయిన్కు అత్యాధునిక యుద్ధ ట్యాంకులు సరఫరా చేస్తామని అమెరికా, రష్యా ప్రకటించిన మరుసటి రోజే ఈ దాడి జరగడం గమనార్హం.
ఉక్రెయిన్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. దీంతో గత అక్టోబర్ నుంచి దేశంలోని విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా రష్యా దాడులు కొనసాగిస్తున్నది. దీనిద్వారా దేశంలో ఎనర్జీ సిస్టమ్ను ధ్వంసం చేయడమే లక్ష్యంగా క్రెమ్లిన్ దాడులకు పాల్పడుతున్నదని ఎనర్జీ మినిస్టర్ గలుష్చెన్కో ఆరోపించారు.