కాట్మాండు: నేపాల్లో బుధవారం సంభవించిన ఆకస్మిక వరద(Nepal Floods)ల్లో 100 మంది చైనా దేశస్థులు గల్లంతు అయినట్లు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ తెలిపారు. నేపాల్తో నిత్యం కమ్యూనికేట్ చేస్తున్నామని లిన్ పేర్కొన్నారు. జాయింట్ రెస్క్యూ ఆపరేషన్ కోసం నేపాల్కు సహకరిస్తున్నట్లు చైనా పేర్కొన్నది. నేపాల్ అవసరాలకు తగినట్లు ఎమర్జెన్సీ సహాయాన్ని అందించనున్నట్లు చైనా వెల్లడించింది. టిబెట్లోని గిరాంగ్ కౌంటీలో కొండచరియలు విరిగిపడడం వల్ల చోటుచేసుకున్న వరదల్లో మిస్సైన వారి సంఖ్య 558గా ఉన్నట్లు చైనా టీవీ పేర్కొన్నది. దీంట్లో 260 మంది విదేశీ వ్యక్తులు ఉన్నారు. వీరికి తోడు నేపాల్లో మరో 826 మంది గల్లంతు అయినట్లు అధికారులు చెప్పారు.
ఇక నేపాల్ వరదల్లో మృతిచెందిన వారి సంఖ్య 270కి చేరుకున్నది. నేపాలీ పోలీసులు తాజాగా తమ సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించారు. బురద వరద బీభత్సం సృష్టించిన ప్రాంతాల నుంచి 270 మంది మృతదేహాలను రికవరీ చేసినట్లు నేపాలీ పోలీసులు చెప్పారు.