బాగ్దాద్: ఇరాక్లోని (Iraq) దియాలా ప్రావిన్స్లో బాంబు దాడి జరిగింది. అమ్రానియాలో స్థానిక ఎంపీ బంధువులపై జరిగిన బాంబుదాడిలో (Bomb Attack) పది మంది మృతిచెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. గురువారం రాత్రి వారు ప్రయాణిస్తున్న వాహనం అమ్రానియా (Amraniyah) పట్టణానికి చేరుకోగానే కొందరు దుండగులు నాటుబాంబులతో దాడిచేశారు. అనంతరం తుపాకులతో కాల్పులు జరిపారు.
దీంతో పది మంది అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఆ ప్రాంతంలో కర్ఫ్యూ (Curfew) విధించామన్నారు. దాడికి గల కారణాలు, ఎవరు చేశారనే విషయం ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు.