ఇస్లామాబాద్: పాకిస్థాన్లో (Pakistan) తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. పాక్ ఆక్రమిత గిల్గిట్-బాల్టి్స్థాన్ (Gilgit-Baltistan) రీజియన్లోని హిమాలయ పర్వతాల్లో హిమపాతం (Avalanche) విరుచుకుపడింది. దీంతో 10 మంది గాయపడ్డారు. మరో 25 మంది గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. పర్వత ప్రాంతంలోని ఆస్టోర్ జిల్లాలోని (Astore district) షంటర్ టాప్ ప్రాంతంలో (Shunter Top area) ఈ ఘటన చోటుచేసుకున్నది. గుజ్జర్ కుటుంబానికి చెందిన 25 మంది పీఓకే నుంచి ఆస్టోర్కు తమ పశువులతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. హిమపాతం కింద చిక్కుకున్న మృతదేహాలను తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నదని చెప్పారు. గాయపడినవారిలో 13 మందిని దవాఖానకు తరలించామని, వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని పాక్ మీడియా వెల్లడించింది.
ఈ దుర్గటనపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ (PM Shehbaz Sharif) విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల నుంచి పాక్ను రక్షించాలని ప్రపంచ దేశాలను అభ్యర్థించారు. మృతుల కుటుంబాలకు గిల్గిత్-బాల్టిస్థాన్ ముఖ్యమంత్రి ఖలీద్ ఖుర్షీద్ (CM Khalid Khurshid Khan) సంతాపం వ్యక్తంచేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.