పీఓకే ప్రధాని అబ్దుల్లా క్యూమ్ నియాజీ తన పదవికి రాజీనామా చేశారు. పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ గద్దె దిగిన తర్వాత ఈ పరిణామం జరగడం గమనించాల్సిన పరిణామం. తహరీర్ ఎ ఇంసాఫ్ పార్టీలో అబ్దుల్లా క్యూమ్ నియాజీపై పెద్ద తిరుగుబాటు చోటు చేసుకుంది. ఈ తిరుగుబాటు తీవ్రం కావడంతో ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేసేశారు. పీటీఐకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీని తర్వాతే ఆర్టికల్ 16(1) ప్రకారం తన ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నానని అబ్లుల్లా క్యూమ్ నియాజీ పీవోకే రాష్ట్రపతి సుల్తాన్ మహ్మద్ చౌధరీకి లేఖ రాశారు.