కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 7 : కూకట్పల్లి జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో భూగర్భ డ్రైనేజీ అభివృద్ధి పనులకు రూ.88.47 కోట్ల నిధులు మంజూరయ్యాయని జడ్సీ వి.మమత తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించాలన్న లక్ష్యంతో భూగర్భ డ్రైనేజీ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో నిధులు మంజూరైనట్లు తెలిపారు. సర్కిళ్ల వారీగా పరిశీలిస్తే.. మూసాపేట సర్కిల్కు రూ.21.54 కోట్లు, కూకట్పల్లి సర్కిల్కు రూ.20.23 కోట్లు, కుత్బుల్లాపూర్ సర్కిల్కు రూ. 18.87 కోట్లు, గాజులరామారం సర్కిల్కు 17.70 కోట్లు, అల్వాల్ సర్కిల్కు రూ.10.13 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఈ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, త్వరలోనే ఆయా కాలనీలు, బస్తీల్లో డ్రైనేజీ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.