సిటీబ్యూరో, మే 26(నమస్తే తెలంగాణ): మహిళ వెంటపడి వేధిస్తున్న ఓ పోకిరీకి ఐదు రోజులు జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే… బంజారాహిల్స్ రోడ్డు నం.12 ప్రాంతానికి చెందిన ఓ మహిళ అపోలో దవాఖానలో పనిచేస్తుంది. ఇటీవల ఉద్యోగిని దవాఖానలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి బైక్ వచ్చి వెంటపడి వేధించాడు.
మరో రోజు బంజారాహిల్స్ లక్ష్మీనరసింహాస్వామి దేవాలయం వద్ద ఉద్యోగిని వెంబడించి వేధింపులకు గురిచేశాడు. దీంతో సదరు ఉద్యోగిని పోకిరీ ఫొటో, బైక్ ఫొటోను సెల్ఫోన్తో తీసి షీ టీమ్స్కు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన షీ టీమ్స్ బృందం బంజారాహిల్స్కు చెందిన జిల్లా నగేశ్ను అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపర్చగా ఐదు రోజులు జైలు శిక్షను విధించింది.