చాంద్రాయణగుట్ట : ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్రకారం..శివగంగానగర్కు చెందిన పి.శ్రీనివాస్,సావిత్రిల కుమారుడు పి.అఖిల్ (23), అవసరానికి తెలిసిన వ్యక్తుల వద్ద డబ్బులు అప్పుగా తీసుకున్నాడు.
తిరిగి ఇచ్చే క్రమంలో సమయానికి డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో ఆందోళనకు గురైన అఖిల్ శుక్రవారం మధ్యాహ్నాం తన గదిలో పడుకుంటానని వెళ్లి తలుపు వేసుకున్నాడు. అయితే ఆ తరువాత అతని స్నేహితుడు గది లోకి వెళ్లి చూడగా అప్పటికే అఖిల్ ఫ్యాన్కు ఉరివేసుకొని కనిపించాడు.
వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా వైద్యశాలకు తరలించారు.కేసును ఛత్రినాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.