కేపీహెచ్బీ కాలనీ, జనవరి 7 : ఆన్లైన్లో ట్రేడ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. శుక్రవారం కూకట్పల్లి జోన్ కార్యాలయంలో వ్యాపారుల సంక్షేమ సంఘం, కిరాణం షాపులు, క్లాత్ మర్చంట్స్, మెడికల్, జనరల్ స్టోర్స్ నిర్వాహకులకు ఆన్లైన్లో ట్రేడ్ లైసెన్స్ జారీపై అవగాహన కలిపంచారు. ఈ సందర్భంగా జడ్సీ మమత మాట్లాడుతూ.. ఆన్లైన్లో సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా ట్రేడ్ లైసెన్స్ను పొందవచ్చన్నారు. ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ కూడా ఆన్లైన్లోనే చేసుకోవచ్చన్నారు. వ్యాపారుల సౌలభ్యం కోసం జీహెచ్ఎంసీ కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. ప్రతి వ్యాపారీ తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ను పొందాలన్నారు. ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీ రవికుమార్, ఏఎంహెచ్వో సంపత్కుమార్, ఎస్ఎస్ మురళీధర్ రెడ్డి, ఎన్విరాల్మెంట్ ఇంజినీర్ విశ్వనాథం, వ్యాపారుల సంక్షేమం సంఘం నేతలు ఉన్నారు.
టీఎస్బీపాస్పై సమీక్ష..
టీఎస్బీపాస్తో భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియ సులభతరమైందని కూకట్పల్లి జడ్సీ మమత అన్నారు. శుక్రవారం జోన్ కార్యాలయంలో ఆర్కిటెక్చర్లతో టీఎస్బీపాస్తో ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భవన నిర్మాణ అనుమతుల కోసం బిల్డింగ్ ఇంజినీర్లు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. ఆన్లైన్లో భవన నిర్మాణ అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, లేనిపక్షంలో సంబంధిత అధికారుల నుంచి పెనాల్టీ వసూలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జోనల్ సిటీ ప్లానర్ ఉమాదేవి, ఎసీపీలు, ఆర్కిటెక్చర్లు పాల్గొన్నారు.