మహోత్సవ కమిటీ కన్వీనర్ రవి కిశోర్
ఖైరతాబాద్, మే 24: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 27న ఎల్బీ స్టేడియంలో యోగా మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ కమిటీ కన్వీనర్, యోగా గురువు పి. రవి కిశోర్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశానికి స్వాతం త్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, అయుష్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ, తె లంగాణ ప్రభుత్వం, యోగా, ఆధ్యాత్మిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ యో గా మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
ఈ సమావేశంలో ఇండియన్ యోగా ఫెడరేషన్, నమస్తే యో గా సంస్థ అధ్యక్షులు బ్రిజ్ భూషణ్ పురోహిత్, యోగా థెరపిస్ట్ అనంత లక్ష్మి, తెలంగాణ యోగా అసోసియేషన్ అధ్యక్షులు రవి కుమార్, డి.సత్యరెడ్డి, ఎన్.కృపాకర్, సాయి చక్రవర్తి పాల్గొన్నారు.