హైదరాబాద్: జన నాట్యమండలి సీనియర్ కళాకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు, గేయ రచయిత జంగ్ ప్రహ్లాద్ కన్నుమూశారు. హైదరాబాద్లోని జగద్గిరిగుట్టలో ఉంటున్న ఆయన.. గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత తుదిశ్వాస విడిచారు. దీంతో జన నాట్యమండలి కళాకారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతికి తీవ్ర సంతాపాన్ని తెలిపుతూ ఆశృనివాళి అర్పిస్తున్నా.
ప్రజా కవిగా, జన నాట్యమండలిలో చురుకైన పాత్రతోపాటు తెలంగాణ ఉద్యమంలో తన ఆట, పాటల ద్వారా కీలక భూమికను పోషించారు. ఆయన స్వస్థలం యాదాద్రి జిల్లాలోని భువనగిరి మండలం హన్మాపురం. ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.