హైదరాబాద్: శుక్రవారం నాడు ప్రపంచ కూచిపూడి దినోత్సవాన్ని కళాకారులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ స్వామీజీ చినజీయర్ స్వామి ఆశ్రమంలో కూడా నృత్యకారులు ప్రదర్శన నిర్వహించారు. సుమారు 700 మంది కూచిపూడి నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో చినజీయర్ స్వామి స్వయంగా పాల్గొని నృత్యప్రదర్శనను తిలకించారు.