సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ) : అర్బన్ ప్రాంతాల్లో చెరువుల పరిరక్షణ, పునర్నిర్మాణంపై రాష్ట్ర పురపాలక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఒక్క రోజు వర్క్షాపు నిర్వహించారు. మున్సిపల్ ఇంజినీర్లు, టౌన్ ప్లానింగ్, ఎన్జీవోలతో జరిగిన ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ మోడరేట్గా వ్యవహరించారు. చెరువుల పునరుద్ధరణ, పరిరక్షణపై ప్రజల భాగస్వామ్యం, ప్రభుత్వ సహకారంపై పలు ఎన్జీవోల ప్రతినిధులతో సాధించిన ప్రగతి, అనుసరించిన విధానాలను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, ఎన్జీవోల ప్రతినిధులు ధృవాన్ష్, కల్పన రమేశ్, కె.శర్మ, ఇతర ఎన్జీవోల ప్రతినిధులు పాల్గొన్నారు.