షేక్పేట్ : ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా ప్రభుత్వ పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదని, ప్రజలకు కష్టాలు లేకుండా తాను ఎల్లప్పుడు అండగా ఉంటానని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. మంగళవారం షేక్పేట్ డివిజన్ పారామౌంట్ కాలనీలో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్,టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు దుర్గం ప్రదీప్కుమార్తో కలిసి పర్యటించారు.
జీహెచ్ఎంసీ అధికారులు మాస్టర్ ప్లాన్కు విరుద్ధంగా కార్వాన్ నియోజకవర్గానికి సంబంధించిన రోడ్డును పారామౌంట్ కాలనీలో నుంచి వేయడానికి ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మంగళవారం పారామౌంట్ కాలనీలో పర్యటించి స్తానికులతో మాట్లాడారు. అంతే కాకుండా జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ అధికారులకు మాస్టర్ ప్లాన్కు విరుద్ధంగా రోడ్డును వేయవద్దని సూచించారు.
రోడ్డు కార్వాన్ నియోజకవర్గంలో నుంచే వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ అన్నారు. ప్రజలు ఎలాంటి బయాలు పెట్టుకోవద్దని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సూచించారు.