చర్లపల్లి/కాప్రా ఆక్టోబర్ 8 : ఇతర రాష్ర్టాల నుంచి వలస వచ్చిన వారికి సీఎం కేసీఆర్ అండగా ఉంటూ వారి సంక్షేమానికి కోసం కృషి చేస్తున్నారని ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్ పరిధిలోని అణుపురం కమ్యూనిటీ హాల్లో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కాసం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, గొల్లూరి అంజయ్యలతో కలిసి డివిజన్ నాయకులు, కార్యకర్తలతో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం, ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, నాయకులు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటానని పేర్కొన్నారు.కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి పెద్దాపురం కుమార్స్వామి, నాయకులు బేతాల బాల్రాజు, కందుల లక్ష్మీనారాయణ, శోభారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో భారీగా చేరికలు….
చిలుకానగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పీఎం కుమార్ (బుచ్చి), ఆయన మిత్ర బృందం బీఆర్ఎస్ పార్టీ ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.