మియాపూర్, జూన్ 13 : మహిళా సంక్షేమంలో తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని విప్ అరెకపూడి గాంధీ అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తమ ప్రభుత్వం వారి కోసం కృషి చేస్తున్నదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలలో భాగంగా చందానగర్ సర్కిల్ కార్యాలయ ఆవరణలోని అంబేద్కర్ కల్యాణ మంటపంలో మహిళా సంక్షేమ దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. డీసీలు వెంకన్న, నందగిరి సుధాంశ్, సీడీపీవో లక్ష్మీబాయి, డీఆర్డీవో ఏపీవో శ్వేత, పీవోలు ఉషారాణి, ఇంద్రసేనలతో కలిసి విప్ గాంధీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద యువతుల పెండ్లి ఖర్చులు భారం కాకుండా కల్యాణ లక్ష్మితో వేడుకలను చేస్తూ తైల్లెన తరువాత తల్లిబిడ్ల క్షేమం కోసం కేసీఆర్ కిట్ పథకాలతో ప్రభుత్వం మహిళలకు అండగా నిలుస్తున్నదన్నారు. మహిళల రక్షణకు ప్రత్యేకంగా షీటీమ్స్ వ్యవస్థ ఎంతో సమర్థంగా పనిచేస్తున్నదన్నారు. నామినేటెడ్ పదవులలో 50 శాతం రిజర్వేషన్ వసతితో రాజకీయంగా మహిళలు ముందడుగు వేసేలా సీఎం కేసీఆర్ ఎంతగానో ప్రోత్సహిస్తున్నారన్నారు.
తెలంగాణలో ఆడపిల్లగా జన్మించటం తమ అదృష్టంగా భావించే రోజులను తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని విప్ గాంధీ అన్నారు. ప్రభుత్వ పరంగా మహిళల సంక్షేమానికి అమలవుతున్న పథకాలన్నింటినీ నియోజకవర్గంలో అర్హులైన ప్రతీ మహిళకు అందించేందుకు ఎమ్మెల్యేగా తాను చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మోహన్గౌడ్, అశోక్ గౌడ్, రఘునాథ్రెడ్డి, శ్రీనివాస్, అంగన్వాడీ టీచర్లు, మహిళలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.