ఎల్బీనగర్ : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొత్తపేట డివిజన్ టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు దేవిరెడ్డి శ్వేతారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ పోస్టర్ను ఎమ్మెల్యే సుధీర్రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ మహిళల సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహిళల సమగ్ర అభివృద్ది కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని అందరూ ఐకమత్యంతో ఘనంగా జరుపుకోవాలని సూచించారు.
కొత్తపేట డివిజన్ మహిళా విభాగం అధ్యక్షురాలు దేవిరెడ్డి శ్వేతారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా కొత్తపేటలోని వైష్ణవి బ్యాంకెట్ హాల్లో కొత్తపేట డివిజన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి దంపతులతో పాటుగా పలువురు ప్రముఖులను ఆహ్వానించామన్నారు.
ఈ కార్యక్రమంలో కొత్తపేట డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు లింగాల రాల్గౌడ్, మహిళా నాయకురాలు అనురాధ, రాజేశ్వరి, సిరీన్ తదితరులు పాల్గొన్నారు.