వ్యవసాయ యూనివర్సిటీ , సెప్టెంబర్ 18: రాజేంద్రనగర్ నార్మ్లో పనిచేస్తున్న గుత్తికొండ అనిజాకు జాతీయ స్థాయిలో అవార్డు దక్కింది. పబ్లిక్ రిలేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీఆర్సీఐ) అమేయ ఉమెన్ ఆఫ్ దీ ఇయర్(2021)అవార్డు లభించింది. ప్రజా సంబంధాలను మెరుగుపర్చడం, కార్పొరేషన్, కమ్యూనికేషన్ మీడియా రిలేషన్స్, నార్మ్ కు వచ్చే విద్యార్థులకు అవగాహన కల్పించడం, శిక్షణ వ్యవసాయం రంగంలో చోటు చేసుకుంటున్న నూతన పరిజ్ఞానంపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలతో అనిజా ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. గోవాలో శనివారం సాయంత్రం జరిగిన పీఆర్సీఐ15వ గ్లోబల్ కాంక్లేవ్లో ఆ రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాలశాఖ మంత్రి గోవింద్గవాడే చేతులమీదుగా అనిజా అవార్డు అందుకున్నారు.