బేగంపేట విమానాశ్రయంలో జరుగుతున్న వింగ్స్ ఇండియా – 2024 ఎగ్జిబిషన్ శుక్రవారం రెండో రోజూ సందర్శకులతో కిటకిటలాడింది. ఆకాశవీధిలో హెలీకాప్టర్ల విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి.
దేశ, విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు, సందర్శకులు విమానాలను చూసి సంబురపడ్డారు. హెలీకాప్టర్లు, భారీ బోయింగ్ విమానాల వద్దకు చేరుకుని సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ మురిసిపోయారు.