హైదరాబాద్ : హనుమాన్ జయంతి, శోభాయాత్ర నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో మద్యం దుకాణాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి మద్యం అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం హైదరాబాద్ నగరంలో శోభాయాత్ర చేపట్టనున్నారు. ఈ క్రమంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. హనుమాన్ శోభాయాత్ర గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్బన్లోని హనుమాన్ మందిర్ వరకు కొనసాగనుంది. కర్మన్ఘాట్ హనుమాన్ టెంపుల్ నుంచి మరో యాత్ర కొనసాగనుంది. కర్మన్ఘాట్ నుంచి చంపాపేట్, కోఠి ఉమెన్స్ కాలేజ్, నారాయణగూడ మీదుగా తాడ్బన్లోని హనుమాన్ మందిర్ వరకు కొనసాగనుంది.