ఎల్బీనగర్ : లింగోజిగూడ డివిజన్లోని గ్రీన్పార్కుకాలనీవాసులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
సోమవారం లింగోజిగూడ డివిజన్లోని గ్రీన్పార్కు కాలనీవాసులతో మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ గ్రీన్ పార్కు కాలనీవాసులకు ఎఫ్టీఎల్ సమస్యలు ఉన్నాయన్నారు.
ఎఫ్టీఎల్లో ఉన్న భూములతో పాటుగా ఎఫ్టీఎల్లో లేని భూములకు కూడా అనుమతులు ఇవ్వడం లేదని, గత రెండు రోజుల క్రితమే కలెక్టర్తో సమావేశం నిర్వహించి ఎఫ్టీఎల్ సమస్యలను పూర్తిగా పరిష్కారం చేయాలని కోరడం జరిగిందన్నారు. గ్రీన్ పార్కు కాలనీవాసులంతా ఒక్కతాటిపై ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.
త్వరలోనే ఎఫ్టీఎల్లోని భూముల రీ సర్వే చేయాలని ఆయన సూచించారు. కాలనీవాసులందరూ తనకు సమానమేనని, అందరికీ న్యాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్పార్కు కాలనీ అధ్యక్షుడు కమలేష్రెడ్డి, ప్రధాన కార్యదర్శి బాల్రెడ్డి, మాజీ అధ్యక్షుడు జగన్రెడ్డి, మహిపాల్రెడ్డి, వెంకట్రెడ్డి కాలనీవాసులు పాల్గొన్నారు.