రూ.5 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
బండ్లగూడ, మార్చి 16: సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలోని పల్లెలన్నీ ప్రగతి పథంలో నడుస్తున్నాయని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పేర్కొన్నారు. గండిపేట మండ లం పరిధిలోని బండ్లగూడలో రూ.5 కోట్లతో పలు అభివృద్ధిపనులకు ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలోని కాలనీలు, గ్రామాల్లో మరో ఏడాదిలో అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో కోట్లాది రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. కేంద్రీయ విహార్ వద్ద స్టామ్ వాటర్ డ్రైన్ పనులను ఆయన మేయర్ మహేందర్ గౌడ్, డిప్యూటీ మేయర్ రాజేందర్తో కలిసి ప్రారంభించారు. అనంతరం 18వ వార్డులోని హిల్ టౌన్ పార్క్, ప్రశాంత్ నగర్, పీరం చెరువులో స్టామ్ వాటర్ డ్రైన్, సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కమిషనర్ వేణుగోపాల్రెడ్డి, కౌన్సిలర్లు సాగర్ గౌడ్, శ్రీలత సురేశ్ గౌడ్, పద్మావతి పాపయ్య యాదవ్, అనిత వెంకటేశ్, లత ప్రేమ్గౌడ్, బీజేఎంసీ టీఆర్ఎస్ అద్యక్షుడు సురేశ్గౌడ్, నాయకులు సుమన్గౌడ్, గోపాల్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు వినతి
అత్తాపూర్, మార్చి 16: అత్తాపూర్ డివిజన్లోని ఆదివాసి తోటి బస్తీ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు బుధవారం ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ను కలిసి తమ బస్తీలో శిథిలావస్థకు చేరుకున్న కమ్యునిటీహల్ను పునఃనిర్మించాలని వినతి పత్రం సమర్పించారు.