చార్మినార్, డిసెంబర్ 13: వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రతి ఒక్కరు చిత్తశుద్ధితో కృషి చేయాలని జూపార్క్ క్యూరేటర్ రాజశేఖర్ తెలిపారు. సంస్థాగతంగా విధులు నిర్వహించే వివిధ ప్రాంతాలకు చెందిన అటవీ సిబ్బందికి రెండు రోజుల పాటు నెహ్రూ జూలాజికల్ పార్క్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వన్యప్రాణులు సమాజ హితానికి ఎంతో దోహదపడుతాయనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు.
వారిలో చైతన్యాన్ని నింపేందుకు కృషి చేయాలని చెప్పారు. అడవులు అనగానే కేవలం వన్యప్రాణులే కాదని, వృక్ష సంపద రక్షణ సైతం విధుల్లో భాగమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ క్యూరేటర్ నాగమణి, వెటర్నరీ వైద్యులు డాక్టర్ ఎం.ఏ హకీం, డాక్టర్ సీహెచ్ ప్రవీణ్, రిసోర్స్ పర్సన్ సయ్యద్ మోహినుద్దీన్, అసిస్టెంట్ క్యూరేటర్ శ్రీదేవి, లక్ష్మణ్, డిప్యూటీ రేంజ్ అధికారి నాగరాజు, మాజీ క్యూరేటర్, ఓఎస్డీ శంకరన్ తదితరులు పాల్గొన్నారు.