మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ రైతుబజార్ సమీపంలో కార్పొరేటర్ వెంకటేశ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్మించిన దేవాలయంలో సోమవారం నిర్వహించిన సాయినాథుడి విగ్రహ ప్రతిష్టాపనలో విప్ ఆరెకపూడి గాంధీ సోమవారం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ గౌరవాధ్యక్షులు అనిల్రెడ్డి, నేతలు సమ్మారెడ్డి, శ్రీనివాస్,రామకృష్ణ, శివరాజ్,గణేశ్, వాసు, పోశెట్టి,రామస్వామి, మున్నా, రామస్వామి, బీబీ, స్వప్న, ప్రీతి తదితరులు పాల్గొన్నారు.
అలాగే మియాపూర్ డివిజన్ ప్రశాంత్నగర్ రాఘవేంద్ర పాంచజన్యలో నూతనంగా నిర్మించిన విజయ గణపతి దేవాలయ ప్రతిష్ట మహోత్సవంలో కార్పొరేటర్ శ్రీకాంత్తో కలిసి విప్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలలో విప్ గాంధీ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు శ్రీనివాస్, గోపికృష్ణ, ఠాగూర్నాథ్,విజయసారథి, రాజశేఖర్, రాకేశ్, అప్పారావు పాల్గొన్నారు.