మియాపూర్, నవంబరు 21: భారతీయ రాష్ట్ర సమి తి తెలంగాణలో ప్రజలకు శ్రీరామరక్ష అని కుల మతాలకు అతీతంగా సంపూర్ణ భరోసా కల్పించగలిగిన ఏకైక సమర్థ రాజకీయ పార్టీయని విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ప్రజలందరి సంక్షేమం కోసం చేస్తున్న కృషితో అన్ని వర్గాల పూర్తి మద్దతుతో హ్యాట్రిక్ విజయం సాధిం చి డిసెంబరు 3న అంబరాన్నంటేలా వేడుకలను నిర్వహించనున్నామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వివేకానందనగర్ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ మాధవరం రోజాదేవి, కూకట్పల్లి డివిజన్లో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణలతో సహా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో కలిసి గాంధీ మంగళవారం ఇంటింటి ప్రచా రం చేపట్టారు.
ఆయన మాట్లాడుతూ ఉద్యమ పంథా తో స్వరాష్ర్టాన్ని సాధించి వెనకబడిన తెలంగాణను పురోగతి పరంగా పరుగులు తీయిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎంతో సంతోషంగా ధైర్యంగా జీవించే వ్యాపారాలను నిర్వహించుకునే గొప్ప వాతావరణాన్ని కల్పించిన బీఆర్ఎస్ సర్కారుకు ప్రజలు పూర్తి అండగా నిలవాలని గాంధీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, ఆయా డివిజన్ల పార్టీ శ్రేణులు, మహిళా నేతలు పాల్గొన్నారు.
హఫీజ్పేట్ డివిజన్ సాయి నగర్ యూత్ కాలనీకి చెందిన బీజేపీ మోచీ సంఘం ప్రతినిధులు పార్టీ నేత అక్బర్ ఆధ్వర్యంలో విప్ గాంధీ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ మేరకు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గాంధీ మాట్లాడుతూ సబ్బం డ వర్ణాలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని, వారి ఆశీర్వాదం తో హ్యాట్రిక్ విజయం తథ్యమన్నారు. ప్రజా సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేసిన ఏకైక సీఎం కేసీఆర్ అని, రాబోయే రోజులలో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలందరికి చేరనున్నాయని గాంధీ పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో శివఠాకూర్, మాధవ్, నందన్ తదితరులున్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్కు చెందిన నాయీ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు కార్పొరేటర్ వెంకటేశ్ గౌడ్, మాజీ కార్పొరేటర్ రంగారావుల ఆధ్వర్యంలో విప్ గాంధీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.