సికింద్రాబాద్, మార్చి 16: టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటామని బోయిన్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు కంటోన్మెంట్ రెండవ వార్డు మార్కండేయ ఆలయ లైన్ అర్జున్నగర్ బస్తీకి చెందిన మహమ్మద్ను స్థానిక నేతలతో కలిసి ఆయనను పరామర్శించారు. నడవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఎమ్మెల్యే సాయన్న దృష్టికి మహమ్మద్ తీసుకెళ్లాడు. దీంతో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు టీఎన్ శ్రీనివాస్ ఆయన ఇంటికి వెళ్లి వీల్చైర్ను అందించారు. కార్యక్రమంలో మార్కెట్ మాజీ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్, వార్డు అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్, జనరల్ సెక్రెటరీ ధన్రాజ్తో పాటు నేతలు నరసింహ, ప్రవీణ్, మహేష్, నాగరాజ్, మహేందర్, గణేష్ , పొన్నాల బాబు, ప్రకాష్, చంద్రకాంత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.