“అమీర్పేట్కు చెందిన నిరంజన్ ఉదయం లేవగానే తన వాట్సాప్లో ట్రేడింగ్కింగ్స్ అనే గ్రూప్లో తన నంబర్ యాడ్ చేయడాన్ని చూశాడు. అందులో ట్రేడింగ్కు సంబంధించిన టిప్స్ చెబుతామంటూ.. కొందరు సందేశాలు పెట్టి ఉండడాన్ని గమనించాడు. తనకు కూడా కొంత ట్రేడింగ్పై అవగాహన ఉండటంతో నా నంబర్ ఎవరిచ్చారని ప్రశ్నించాడు… మేం ముంబైలో ట్రేడింగ్ కంపెనీ నిర్వాహకులం. దేశవ్యాప్తంగా ట్రేడింగ్పై అసక్తి ఉన్న వారిని గ్రూప్లో చేర్చి.. ట్రేడింగ్ టిప్స్ చెబుతుంటాం..మీరే స్వతహాగా ట్రేడింగ్ చేసినా..లేదా మాకు మీ డీమ్యాట్ ఖాతాను అప్పగించినా.. ఫర్వలేదదం’టూ మాటలు కలిపారు.
వారి మాటలు విని తాను కూడా ట్రేడింగ్ చేస్తానంటూ..నిరంజన్ ముందుకొచ్చాడు.. అతడితో తాము సూచించే లింక్ను క్లిక్ చేయండంటూ.. అందులో రూ. 10 వేలు పెట్టుబడి పెట్టించారు..అందులో లాభాలు తెప్పించినట్లు నటించారు. వారిని నమ్మిన బాధితుడు దఫ దఫాలుగా రూ. 4 లక్షలు పెట్టుబడి పెట్టాడు.. ఇంతలో వారు ఆ యాప్ మూతపడిపోయింది..
“టోలీచౌక్కు చెందిన అమీర్ నంబర్ను కూడా క్రిప్టో గ్రూప్ పేరు ఉన్న గ్రూప్లో యాడ్ చేశారు.. ఒకటి రెండు సార్లు బిట్కాయిన్ గురించి అందులో చర్చ జరిగింది. తాను కూడా బిట్కాయిన్లో పెట్టుబడి పెడుతానంటూ.. అమీర్ ముందుకు రావడంతో ఆ గ్రూప్లో ఒక లింక్ను పంపించారు. ఆ లింక్ నుంచి లక్ష రూపాయల విలువైన బిట్కాయిన్ను కొన్పించారు. ఆ కాయిన్తో పెట్టుబడి పెట్టించగా, వర్చువల్గా రూ. 50 వేల లాభాన్ని స్క్రీన్పై చూశాడు.. మంచి లాభం వస్తుందని మరో లక్ష రూపాయల బిట్కాయిన్కొని అందులో పెట్టుబడి పెట్టాడు.
ఆ తరువాత లక్ష రూపాయల లాభం తెరపై కన్పించింది. కానీ.. వాటిని డ్రా చేసుకోవడానికి వీలు లేకపోవడంతో అనుమానం వచ్చి తన బిట్కాయిన్లు తమకు వాపస్ ఇవ్వాలంటూ నిర్వాహకులను ఫోన్లో కోరాడు. అందుకు నిరాకరించి ఫోన్లు కట్ చేశారు. ఇలా అమీర్ రూ. 2 లక్షలు నష్టపోయాడు.
ప్రతి రోజు వందలు, వేల సంఖ్యలో ఫోన్ నంబర్లను సేకరిస్తూ వాటిని తమ వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ చేస్తుంటారు సైబర్ నేరగాళ్లు.. ఇలా ఒక ప్రాంతం కాదు.. దేశ వ్యాప్తంగా ఉన్న నంబర్లు అందులో ఉంటాయి.. ఈ ముఠాలకు చెందిన వారు ఒకరిద్దరూ తరచూ ట్రేడింగ్ గురించి అందులో మాట్లాడుతూ, గ్రూప్లో ఉన్న వారికి ఆశ చూపిస్తుంటారు. ఇలా నెమ్మదిగా వాళ్ల వైపునకు తిప్పుకొని, వివిధ రకాలైన ట్రేడింగ్స్ పేరుతో పెట్టుబడులు పెట్టిస్తున్నారు.
యాప్ను తయారు చేసి… వారం, పది రోజుల పాటు దానిని అందుబాటులో ఉంచేస్తున్నారు. తరువాత పేరు మార్చి మళ్లి వాట్సాప్ గ్రూప్లలో సర్క్యిలేట్ చేస్తున్నారు. తియ్యగా, నమ్మకంగా మాట్లాడి..వలలో పడేస్తున్నారు. వంద మందిలో ఒక్కరూ స్పందించినా.. ఆగంతకులకు కాసుల పంటపండుతుంది. ప్రతి రోజూ కొత్త పేర్లతో వాట్సాప్ గ్రూప్లు.. యాప్లు తయారు చేస్తూ అమాయకులను నిండా ముంచేస్తున్నారు.
వాట్సాప్లో కొత్తగా గ్రూప్లు తయారు చేశారంటే.. వాటికి స్పందించకుండా ఉండటం మంచిది. స్పందిస్తే ఏదో ఒక విధంగా మిమ్మల్ని పరిచయం చేసుకోవడం, ఆ తరువాత మాయమాటలు చెప్పి బుట్టలో వేసేందుకు సైబర్నేరగాళ్లు ప్రయత్నిస్తారు. గుర్తుతెలియని వ్యక్తులు ఏదైనా వాట్సాప్ గ్రూప్లలో నంబర్ చేర్పించారంటే, అందులో నుంచి బయటకు రావడం మంచిది. బిట్కాయిన్, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటూ సూచనలు వస్తే.. వాటికి జోళికి వెళ్లొద్దు.