సికింద్రాబాద్ : రాష్ట్ర సర్కారు కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం మేడే వేడుకలు సికింద్రాబాద్, కంటోన్మెంట్ వ్యాప్తంగా కార్మికులు ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్లోని సీతాఫల్మండి, మెట్టుగూడ, బౌద్దనగర్, తార్నాక, అడ్డగుట్ట ప్రాంతాలతో పాటు కంటోన్మెంట్లోని మోండా డివిజన్, కారానా, బోయిన్పల్లి, మారేడ్పల్లి, తిరుమలగిరి, బొల్లారంలలో కార్మికులు మేడే వేడుకలను సంబురంగా జరుపుకున్నారు.
ఈ క్రమంలో మేడేను పురస్కరించుకుని బోయిన్పల్లి చౌరస్తాలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కార్మిక జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక బృహత్తర కార్యక్రమాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తుందన్నారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, నేతలు ముప్పిడి మధుకర్, నర్సింహ్మరావు, ప్రవీణ్యాదవ్, టీఎన్ శ్రీనివాస్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.