రవీంద్రభారతి, మార్చి 12 : సాంస్కృతిక సారథి కళాకారుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలోని మెయిన్హాల్లో తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరై ప్రసంగించారు.