దుండిగల్, ఆగస్టు 29: ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజును మంగళవారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ శంభీపూర్లోని ఎమ్మెల్సీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సుమారు రెండు గంటల పాటు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపుపై చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఐక్యంగా సాగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.