ఎల్బీనగర్ ( హైదరాబాద్ ) : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పరిష్కరించడానికి కృషి చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి (Mla Sudhir reddy) అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజల నుంచి స్వీకరించిన వినతిపత్రాలను శనివారం పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను పరిష్కరించామని తెలిపారు. నూతన డ్రైనేజీ లైన్లు వేయడంతో పాటుగా మంచినీటి పైప్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేశామని వివరించారు.
రాబోయే రోజుల్లో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఆనంద్నగర్ చౌరస్తా, సరూర్నగర్ గాంధీ బొమ్మ చౌరస్తా, బీఎన్రెడ్డినగర్ డివిజన్ తెలంగాణ చౌరస్తా, కొత్తపేట ఓమ్ని నుంచి కొత్త పేట గ్రామం వైపు రోడ్లలో ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయని వెల్లడించారు. ప్రజల నుంచి అందిన ప్రతి
సమస్యను పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.