సిటీబ్యూరో, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) / జూబ్లీహిల్స్ : టీవీ కళాకారులు, కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యదవ్ పేర్కొన్నారు. యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో గురువారం తెలుగు టీవీ డిజిటల్ మీడియా టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి తలసాని, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలంతో కలిసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నాగబాల డి.సురేశ్కుమార్తో కలిసి ఉచిత వైద్య శిబిరాన్ని, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై రూపొందించిన ఆడియోను విడుదల చేశారు. ఎంఎన్జే క్యాన్సర్ దవాఖాన సౌజన్యంతో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ ప్రారంభించగా..
కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్తో కలిసి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సీఎం కేసీఆర్ బర్త్డే కేక్ను కట్చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సము ద్రాల వేణుగోపాలచారి కార్యక్రమానికి హాజరై టీవీ ఫెడరేషన్ను అభినందించారు. ఈ వేడుకలలో ప్రముఖ నటులు, 24 క్రాఫ్ట్స్ కార్మికులతో పాటు ఫెడరేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కే.రాకేశ్, విజయ్కుమార్, కోశాధికారి నరేందర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి మోహన్రాజ్, ఉపాధ్యక్షులు మురళి, కార్యనిర్వాహక కార్యదర్శులు రమేశ్, ఖుద్దూస్ తదితరులు పాల్గొన్నారు.
స్కందగిరి ఆలయంలో యాగం
బన్సీలాల్పేట్, ఫిబ్రవరి 16 : సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని గురువారం పద్మారావునగర్లోని స్కందగిరి సుబ్రమణ్యస్వామి దేవాలయంలో ‘తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి’ ఆధ్వర్యంలో రుద్రసహిత దక్షిణామూర్తి హోమం, లక్ష్మీసుదర్శన యాగం, చండీయాగం నిర్వహించారు. ఈ పూజలలో తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సంకేపల్లి సుధాకర శర్మ, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యురాలు సుమలత శర్మ, కార్పొరేటర్ సామల హేమ, బ్రాహ్మణ సేవా సమితి వారాసిగూడ డివిజన్ అధ్యక్షుడు ఆర్వీఎల్ఎన్ ప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు కరాటే రాజు, పద్మ, కాంచన పాల్గొన్నారు.