పహాడీషరీఫ్ : జల్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పహాడీషరీఫ్ ప్రధానరహదారి మధ్య నుంచి ఎర్రకుంట వరకు రూ. 50 లక్షల నిధులతో సెంట్రల్ లైటింగ్ పనులకు పహాడీషరీఫ్లో బుధవారం చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇటీవలనే కోట్లాది రూపాయల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులను చేయిస్తున్నామన్నారు, తాగునీటి సమస్య పరిష్కారం కోసం రిజర్వాయర్లను నిర్మిస్తున్నామన్నారు. జల్పల్లి పెద్ద చెరువు సుందరీకరణ కోసం రూ. 9 కోట్లతో నిధులు కేటాయించామన్నారు.
సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతో ప్రధానరహదారులలో అంధకారం తొలగిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో జల్పల్లి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్లా సాది, కమిషనర్ జి.పి కుమార్, కో -ఆప్షన్ మెంబర్ సూరెడ్డి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు పుష్పమ్మ, శంషోద్దీన్, మజర్ అలీ, కెంచె లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్, తదితరులు పాల్గొన్నారు.