Asaduddin Owaisi : ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ నామినేషన్ వేశారు. శుక్రవారం ఆయన తన అనుచరులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానిక వెళ్లారు. అక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు.
#WATCH | AIMIM President & candidate from Hyderabad constituency, Asaduddin Owaisi files nomination for Lok Sabha elections#LokSabhaElections2024 pic.twitter.com/bMZNPZPkEe
— ANI (@ANI) April 19, 2024
అసదుద్దీన్ తన తండ్రి సలావుద్దీన్ ఒవైసీ మరణించినప్పటి నుంచి హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. తాజాగా ఇప్పుడు మరోసారి నామినేషన్ వేశారు. అసదుద్దీన్పై బీజేపీ తరఫున మాధవీలత బరిలో దిగుతున్నారు.