హైదరాబాద్: వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు మహమ్మద్ సలీమ్ నేతృత్వంలో ప్రారంభమైన సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కొన్ని ముఖ్యమైన అంశాలపై పూర్తి స్థాయిలో చర్చ జరగని కారణంగా వచ్చే నెల 16వ తేదీకి ఈ మీటింగ్ను వాయిదా వేశారు. వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తుల పరిరక్షణ, అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు మహమ్మద్ సలీమ్ తెలిపారు.
అలాగే అనారోగ్యంతో బాధలు పడుతున్న వారు, ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో బోర్డు మెంబర్లు జనాబ్ అక్బర్ నిజాముద్దీన్ హుస్సానీ, జాకిర్ హుస్సేన్ జావిద్, మిర్జా అన్వర్ బైగ్, టాగర్ ఇక్బాల్ ఐపీఎస్, నిసార్ హుస్సేన్ హైదర్ ఆఘాతోపాటు అడ్వొకేట్ వహీద్ అహ్మద్, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షవానవాజ్ ఖాసిం ఐపీఎస్ తదితరులు పాల్గొన్నారు.