హైదరాబాద్(తెలంగాణ) మే 7 : ప్రముఖ కార్ డీలరైన వీవీసీ మోటార్స్ ఓల్డ్ బోయిన్పల్లిలో నూతన మహీంద్రా షోరూమ్ను ప్రారంభించింది. దాదాపు 6,500స్క్వేర్ఫీట్ల అతి విశాలవంతమైన షోరూమ్ను, అలాగే ఎల్బీ నగర్లోని జిల్లెలగూడలో అతిపెద్ద సెర్వీస్ సెంటర్ను ప్రారంభించింది. వీవీసీ మోటార్స్ మానేజింగ్ డైరెక్టర్ వీవీ రాజేంద్రప్రసాద్, వీవీసీ మహీంద్రా షోరూమ్ సీఈఓ వీరేన్ చౌదరి కలిసి నూతన మహీంద్రా షోరూమ్, బాడీ షాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వీవీ రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ మా వీవీసీ మోటార్స్నుంచి ఇక్కడ ఓల్డ్ బోయిన్పల్లిలో అత్యంత విశాలవంతమైన షోరూమ్ను, అలాగే ఎల్బీ నగర్లోని జిల్లెలగూడలో అధునాతన సెర్వీస్ సెంటర్ను స్టార్ట్ చేయడం సంతోషంగా ఉందన్నారు.
ఈ షోరూమ్ గ్రాండ్ లాంచ్ కూడా ఈ నెలలో ఉంటుందని, ఇక్కిడి బాడీ షాప్లో ఒకే సమయంలో 18 కార్లను సర్వీస్ చేసి ఇవ్వగలమని, ఇదివరకే మాకు హైదరాబాద్లోని కొత్తగూడ, హైటెక్ సిటీ, ఈసీఐఎల్, కూకట్పల్లిలో అత్యాధునిక సెర్వీస్ సెంటర్స్ ఉన్నాయన్నారు. ఇప్పుడు కొత్తగా ఎల్బీ నగర్లోని జిల్లెలగూడలో కూడా స్టార్ట్ చేయడం సంతోషంగా ఉందని, అలాగే బాచుపల్లిలో కూడా సెర్వీస్ సెంటర్ ఉందని తెలిపారు. కొత్తగూడ,ఫైనాన్షియల్, శంషాబాద్, అత్తాపూర్, ఘట్కేసర్, నాచారం, ఈసీఐఎల్, ఎల్బీనగర్, మలక్పేట్, హిమాయత్ నగర్, సనత్నగర్, కొంపల్లి, బాచుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లిలో షోరూమ్స్ ఉన్నాయని, ఇప్పుడు కొత్తగా ఓల్డ్ బోయిన్ పల్లిలో కొత్త షోరూమ్ని ప్రారంభించామని తెలిపారు. కార్యక్రమంలో కొత్త మహీంద్రా ధార్ కార్ను ఫస్ట్ డెలివరీ ఇచ్చారు.